క్రైమ్ థ్రిల్లర్ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అందులో కొంత సస్పెన్స్ వుంటే మరింత ఆసక్తిని రేపుతాయి.. కలియుగం పట్టణంలో కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథ… కథనాలతో తెరకెక్కింది.. దీనిని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్తో విడుదలయిన ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29 విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్ను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూద్దాం.
కథ:
నంద్యాలలో మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) లకు విజయ్, సాగర్ ( విశ్వ కార్తికేయ) అనే కవల పిల్లలు ఉంటారు. చిన్నప్పటి నుంచే ఈ కవల పిల్లలది విభిన్నమైన మనస్తత్వం. ఒకరు రక్తం చూసి భయపడితే.. మరొకరు మాత్రం సైకోలా ఆనంద పడతాడు. అందుకే సైకోలా ఆనందపడే వ్యక్తిని మానసిక వికలాంగులు వుండే చోట చేర్చుతాడు మోహన్. అలా కొన్నేళ్ళు గడుస్తాయి. మరొకరిని తమ వద్దే వుంచుకుని విద్య బుద్ధులు నేర్పుతారు. అయితే శ్రావణి (ఆయుషి పటేల్) అనే అమ్మయి ఇతన్ని ఇష్టపడుతుంది. అయితే ఆమె… డ్రగ్స్ కి అలవాటుపడి… అత్యాచారాలు చేసే క్రూర మృగాలను వేటాడి, వెంటాడి చంపుతూ ఉంటుంది. అయితే నంద్యాలలో జరిగే ఘోరాలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) నియమిచబడుతుంది. మరి ఈ అధికారిని కనిపెట్టిన విషయాలు ఏంటి? ఇక్కడ క్కడ జరిగే ఘోరాలతో కవలపిల్లకున్న లింకేంటి తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కవలల పాత్రల్లో విశ్వ తన వేరియేషన్స్ చూపించాడు. మంచి వాడిగా, సైకోలా నటించి మెప్పించాడు. కొన్ని చోట్ల భయపెట్టాడు. యాక్షన్ ఏమోషన్స్ డాన్స్ ఇలా అన్నింటిలోనూ ఆకట్టుకుంటాడు. ఆయుషి పటేల్ ఫస్ట్ హాఫ్ లో మెప్పిస్తుంది. చిత్రా శుక్లా సెకండ్ హాఫ్ లో ఆకట్టుకుంటుంది. ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.
సినిమా ఎలా ఉంటుందంటే…
దర్శకుడు కలియుగం పట్టణంలో కోసం మంచి పాయింట్, కథను తీసుకున్నాడు. క్రైమ్స్ నీ ఇలా కూడా చేయొచ్చా? అనే భయం కలిగించేలా సినిమా ఉంటుంది. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంతో కొత్తగా, ఆసక్తి కలిగించేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతో నిండి పోయింది. వాటికి సమాధానాలు సెకండ్ హాఫ్ లో దొరుకుతాయి.
ఫస్ట్ హాఫ్ ఎంతో ఇంటరెస్టింగ్ గా సాగితే.. ఆ ఊపు ఆంతగా ద్వితీయార్థంలో కనిపించకపోవచ్చు. కానీ ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు.. తల్లిదండ్రుల పెంపకం సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు.
టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్ 3