ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.సి. క్రిష్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని ‘మక్కుళు మక్కుళు కాలేజూ యవ్వన మర్కట గ్యారేజూ’ పాటను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. ఈ పాటను శ్రీరామ్ తపస్వి రాశారు.
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ ‘‘నేను కో డైరెక్టర్గా చంద్ర మహేష్ గారి దగ్గర ‘చెప్పాలని ఉంది’ చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత ‘ఆది’ సినిమాతో దర్శకుణ్ణి అయ్యాను. చంద్ర మహేష్గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సుప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడుగారికి ఇష్టమైన దర్శకుల్లో చంద్ర మహేష్ ఒకరు. ఆయన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మూడువిభిన్న ప్రేమ కథలతో ‘పిఠాపురంలో’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పెద్ద హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని చెప్పారు.
దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ ‘‘ఈ వారంలో ఈ సినిమా ట్రయిలర్ విడుదల చేస్తున్నాం. ఏప్రిల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం. నా కెరీర్లోనే ఇదొక మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని తెలిపారు.
డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్,
స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ,
మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర .










