తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం వి.ఎన్. ఆదిత్య అధ్యక్షతన ఏర్పడిన అనంతరం నిర్వహించిన తొలి మెడికల్ హెల్త్ క్యాంప్ గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రిలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కూపన్ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు.
సంఘ సభ్యులందరూ ఈ ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని సుమారు నెల రోజులపాటు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెడికవర్ తెలంగాణ రీజియన్ హెడ్ డా. రామ్, తెలంగాణ హెడ్ మరియు పీఆర్ఓ శ్రీ సంతోష్లు దర్శకుల సంఘ సభ్యులను ఆహ్వానించి, వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షల ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.
ప్రధాన కార్యదర్శి పెండ్యాల వెంకట రామారావు గారు ఉదయం 7 గంటలకే ఆసుపత్రికి చేరుకుని, చివరి సభ్యుడి వరకు పరీక్షలు సమయానికి పూర్తి అయ్యేలా ఏర్పాట్లను పునఃసమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, సీనియర్ దర్శకులు ఎన్. శంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రస్తుత హెల్త్ కమిటీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్, కోశాధికారి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు వి. సముద్ర, భాస్కర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్, ఈసీ సభ్యులు మల్లిక, సాగర్ కె. చంద్ర, అంజిబాబు, రమణ మొగిలి, సాయి సురేంద్ర బాబు, హెల్త్ కమిటీ సభ్యుడు అశోక్ కుమార్, సభ్యుడు సీతారామరాజు తదితరులు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించే అత్యాధునిక పరికరాలతో, వేల రూపాయల విలువైన పరీక్షలను దర్శకుల సంఘ సభ్యులకు ఉచితంగా అందించడం పట్ల వి.వి. వినాయక్, వి.ఎన్. ఆదిత్య, రామారావు, సాయి రాజేష్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ హెల్త్ క్యాంప్ను ప్రతి సభ్యుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు కోరారు.
అదనంగా, ఐదు రకాల అల్పాహారం, డ్రై ఫ్రూట్స్తో కూడిన ఆరోగ్యకరమైన పాయసం అందించి ఆతిథ్యం ఇచ్చిన మెడికవర్ యాజమాన్యాన్ని కార్యక్రమానికి హాజరైన సభ్యులు ప్రశంసించారు.









